Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ దంపతులకు జాక్‌పాట్ : రూ.2.5 కోట్ల పెట్టుబడి.. ఒక్క రోజులో రూ.10 కోట్లకు చేరిక

anushka - kohli
ఠాగూర్
శుక్రవారం, 24 మే 2024 (12:17 IST)
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ - అనుష్క దంపతులకు జాక్‌పాట్ తగిలింది. వారు కలిసి పెట్టిన పెట్టుబడి ఒక్క రోజులోనే నాలుగు రెట్లు పెరిగిపోయింది. రూ.2.5 కోట్ల పెట్టుబడి పెడితే అది ఏకంగా రూ.10 కోట్లకు చేరింది. ఈ వివరాలను పరిశీలిస్తే, గో డిజిట్ జనవల్ బీమా కంపెనీ గురువారం స్టాక్ మార్కెట్‌లో దూకుడు ప్రదర్శించింది. స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయిన వెంటనే దూసుకునిపోయింది. దాని షేర్ల ధరలు రూ.300 మార్క్‌ను దాటేశాయి. దీంతో టీమిండియా స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ అనుష్కల పెట్టుబడులు కూడా ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. 
 
గో డిజిట్ షేరును కోహ్లీ రూ.75 చొప్పున మొత్తం 2,66,667 షేర్లను కొనుగోలు చేశాడు. ఈ మొత్తం విలువ రూ.2 కోట్లు. అనుష్క శర్మ రూ.50 లక్షలతో 66,667 షేర్లు కొనుగోలు చేస్తే వాటి ధర ఇపుడు రూ.2.5 కోట్లకు పెరిగింది. విరాట్ రూ.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన షేర్ల ధరలు రూ.8 కోట్లు అయ్యాయి. అంటే వీరిద్దరూ కలిసి మొత్తంగా రూ.2.5 కోట్లు పెట్టుబడిపెట్టగా ఒక్క రోజులోనే వాటి విలువ రూ.10 కోట్లకు చేరింది. అంటే వారి పెట్టుబడికి నాలుగింతలు ప్రతిఫలం లభించింది. 
 
కంపెనీకి విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గానూ ఉన్నాడు. ఐపీవోలో భాగంగా గోడిజిట్ రూ.1125 కోట్ల విలువైన 5.48 కోట్ల షేర్లను ఆఫర్ లే కింద ఐపీఓలో భాగంగా విక్రయించింది. సెలెబ్రిటీలు పెట్టుబడులు పెట్టిన సంస్థలు లిస్టింగ్ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments