Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BudgetSession2019 : ఉద్యోగులకు గుడ్‌న్యూస్ : రూ.5 లక్షల వరకు పన్ను లేదు...

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:35 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు రూ.5 లక్షల వరకు పూర్తిగా పన్ను మినహాయించారు. ప్రస్తుతం రూ.2.50 లక్షల వరకు ఉంటే... ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. అంటే వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నవారు ఇక పన్ను చెల్లించాల్సిన అవసరంలేదు. దీనివల్ల 3 కోట్ల మంది వేతనజీవులు, పెన్షనర్లు లబ్దిపొందనున్నారు. మిగిలిన శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
 
అలాగే, ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. 
 
ఈ ఏడాది జనవరి వరకు జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకు చేరిందన్నారు. సినిమా టికెట్లపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించామన్నారు. ప్రస్తుతం నెలకు రూ. 97,100 కోట్లు పన్ను వసూళ్లవుతున్నాయన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాల పన్ను వసూళ్లు సాలీనా 14 శాతం మేర పెరిగాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments