Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటీశ్వరులపై బ్యాంకుల ఉదారత.. రూ.1.76 లక్షల కోట్ల రుణాలు కొట్టివేత

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (11:19 IST)
దేశంలోని కోటీశ్వరుల పాలిట బ్యాంకులు మరోమారు ఉదారతను ప్రదర్శించాయి. గత మూడేళ్ళలో మొండిబాకీలను రూ.1.76 లక్షల కోట్లను బ్యాంకులు కొట్టివేశాయి. ఈ విషయం సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. 
 
సమాచార హక్కు చట్టానికి లోబడి ఆర్‌బీఐ నుంచి ఓ ఆంగ్ల చానెల్‌ పొందిన సమాచారం ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిల కొట్టివేతలు బాగా పెరిగాయి. 
 
2015-18 మధ్యకాలంలో షెడ్యూలు కమర్షియల్‌ బ్యాంకులు రూ.2.17 లక్షల బకాయిలను కొట్టివేశాయి. పెద్ద నోట్ల రద్దు (2016 నవంబరు 8) తర్వాత రైట్‌ ఆఫ్‌లు శరవేగంగా పెరిగాయి. ప్రభుత్వ బ్యాంకులకు రూ.500 కోట్లకు పైగా ఎగవేసిన వారు 88 మందని, వీరంతా ఎగవేసిన మొత్తం రూ.1.07 లక్షల కోట్లని తెలిసింది. 
 
అంటే, సగటున ఒక్కో డిఫాల్టర్‌ ఎగవేసిన మొత్తం రూ.1,220 కోట్లు. ఎస్‌బీఐకి ఈ మార్చి 31 నాటికి 220 మంది రూ.100 కోట్లకు పైగా ఎగవేశారు. వీరు ఎగవేసిన మొత్తం రూ.76,600 కోట్లు. కనీసం రూ.500 కోట్లకు పైగా బకాయిపడ్డ 33 మంది ఎగవేసిన మొత్తం రూ.37,700 కోట్లు. 
 
అలా గత మూడేళ్ళలో భారత బ్యాంకింగ్ వ్యవస్థ రూ.1.76 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిలను రైటాఫ్ (ఖాతాల్లోంచి కొట్టివేయడం) చేసింది. ఈ బకాయిలన్నీ రూ.100 కోట్లు లేదా అంతకుపైగా ఎగవేసిన 416 మంది రుణగ్రహీతలవే కావడం గమనార్హం. సగటున ఒక్కొక్కరూ ఎగవేసిన మొత్తం రూ.424 కోట్లు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments