థాయ్‌లాండ్‌లో చనిపోయిన ఇండియన్ టెక్కీ

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (11:05 IST)
థాయ్‌లాండ్‌లో ఓ భారతీయ టెక్కీ దుర్మరణం చెందారు. ఆమె పేరు ప్రజ్ఞ (29). స్థానికంగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె మృత్యువాతపడ్డారు. బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నా ఆమె... హాంగ్ కాంగ్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఫుకెట్‌లో నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ప్రస్తుతం ఆమె మృతదేహం థాయిలాండ్‌లోని ఓ ఆసుపత్రి మార్చురీలో ఉంది. పజ్ఞ కుటుంబం మధ్యప్రదేశ్ ఛత్తార్ పూర్ జిల్లాలో నివసిస్తోంది. ప్రజ్ఞ మరణించిన విషయాన్ని బెంగళూరులో ఉన్న ఆమె రూమ్మేట్‌కు థాయిలాండ్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె రూమ్మేట్ ప్రగ్న కుటుంబసభ్యులకు తెలిపారు. తమ కూతురు చనిపోయిందన్న వార్తతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా వివరించారు. 
 
బ్యాంకాంగ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా ప్రగ్న కుటుంబీకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, థాయిలాండ్‌లో ఉన్న మన ఎంబసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఆమె కుటుంబీకులకు వెంటనే పాస్ పోర్టును ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments