Publish Date: Fri, 20 Sep 2019 (09:22 IST)
Updated Date: Fri, 20 Sep 2019 (09:22 IST)
చంద్రుడి దక్షిణ ధృవం అన్వేషణ నిమిత్తం చంద్రయాన్ - 2 పేరుతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన ప్రయోగం చివరి నిమిషంలో విఫలమైన విషయం తెల్సిందే. జాబిల్లిపైకి పంపిన విక్రమ్ ల్యాండర్... హార్డ్ ల్యాండింగ్ కారణంగా భూమితో సంబంధాలు తెగిపోయాయి. ఫలితంగా విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో కూడా తెలియలేదు.
ఈ నేపథ్యంలో విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం అమెరికా పరిశోధనా సంస్థ నాసా కూడా రంగంలోకి దిగింది. ఇందుకోసం ఈ నెల 17వ తేదీన లూనార్ ఆర్బిటర్ను నాసా పంపించింది. ఈ లూనార్ ఆర్బిటర్ తీసిన చిత్రాల్లో విక్రమ్ కనిపించిందా లేదా అన్న దానిపై ఇస్రో శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నాు.
మరోవైపు, చంద్రుని కక్ష్యలో ఆర్బిటర్ సక్రమంగానే పనిచేస్తోందని, ఆర్బిటర్లోని పేలోడర్లు కూడా బాగానే పనిచేస్తున్నాయని ఇస్రో ప్రకటించింది. అయినప్పటికీ విక్రమ్ ల్యాండర్తో సంబంధాలు కలవకపోవడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 7న చంద్రుడిపై ల్యాండ్ అవుతూ ఇస్రోతో విక్రమ్ ల్యాండర్ సంబంధాలు కోల్పోయిన విషయం తెల్సిందే.
webdunia
Publish Date: Fri, 20 Sep 2019 (09:22 IST)
Updated Date: Fri, 20 Sep 2019 (09:22 IST)