Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల ఊబిలో ఏపీ.. ఎకనామిక్ అడ్వైజర్‌గా రజనీశ్‌కుమార్‌‌

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (11:53 IST)
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌ సర్కార్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ అప్పుల, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసం మరో సలహాదారుగా రజనీశ్‌ కుమార్‌‌ను నియామకం చేసింది జగన్‌ సర్కార్‌. గురు గ్రామ్‌‌కు చెందిన ఆర్థిక నిపుణుడు రజనీశ్‌కుమార్‌‌ను కేబినెట్‌ ర్యాంకుతో నియమిస్తున్నట్లు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఇక ఈ పదవిలో రెండేళ్లు పాటు కొనసాగనున్నారు రజనీశ్‌ కుమార్‌. ఆర్థిక వనరుల సమీకరణ కు ఇప్పటికే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌ను సలహాదారుగా నియమించింది ఏపీ ప్రభుత్వం. ఢిల్లీ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు గార్గ్. 
 
అలాగే… కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుడిగా ఆర్ పి ఠాకూర్‌ కూడా నియమించింది ఏపీ సర్కార్‌. రాష్ట్ర కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుడిగా మాజీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ను నియమిస్తూ ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్త ర్వులు జారీ చేశారు. ఇక ఠాకూర్‌ టీడీపీ హయాంలో డీజీపీగా పనిచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments