Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలికను పశువుల పాకలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం...

Advertiesment
krishna
, ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (11:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలోని కృత్తివెన్ను మండలంలోని ఓ పంచాయతీ పరిధిలో జరిగింది. 
 
స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 14 ఏళ్ల బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. అదేప్రాంతానికి చెందిన వివాహితుడైన పి.అనంతబాబు, జి.తరుణ్‌తోపాటు ఓ బాలుడు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
గురువారం రాత్రి తమ ఇంటి సమీపంలోని పశువుల పాకలోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి బంటుమిల్లి ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ కోర్టుకు అప్పగించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను మచిలీపట్టణం జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ రోజు దేశంలో కరోనా వైరస్ బులిటెన్