Webdunia - Bharat's app for daily news and videos

Install App

చందనంలో కాస్త పసుపును కలిపి ముఖానికి రాసుకుంటే?

ఈ కాలంలో ముఖచర్మం పొడిబారడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇటువంటి సమస్యల వలన రకరకాల క్రీములను వాడుతుంటారు. అవి చర్మం రంగును కోల్పోయేలా చేస్తాయి. అందువలన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ సమస్యలను తొలగ

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (14:31 IST)
ఈ కాలంలో ముఖచర్మం పొడిబారడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇటువంటి సమస్యల వలన రకరకాల క్రీములను వాడుతుంటారు. అవి చర్మం రంగును కోల్పోయేలా చేస్తాయి. అందువలన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ సమస్యలను తొలగించుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
బంగాళాదుంపలను ఉడకబెట్టుకున్న తరువాత వాటిని ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. కాసేపయ్యాక వాటిని తీసుకుని బాగా నలిపి ముఖానికి రాసుకోవాలి. దీంతో ముఖంలో నల్లటి వలయాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. నారింజ పండు తొక్కను ముఖంపై రుద్దుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 
 
పసుపు, చందనములను పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. పచ్చిపాలను దూదిలో ముంచి ముఖానికి మర్దన చేసుకుంటే ఫలితం ఉంటుంది. వంటసోడాలో కొద్దిగా నీటిని కలుపుకుని ముఖానికి రాసుకుంటే నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
 
కీరదోసకాయను మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. కొబ్బరినూనె, కర్పూరాన్ని మిశ్రమంగా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వలన కోమలమైన చర్మాన్ని పొందవచ్చును. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments