పాలతో గంధం చెక్కని అరగదీసి అలా చేస్తే...

Webdunia
మంగళవారం, 14 మే 2019 (22:17 IST)
వేసవికాలం వచ్చిందంటే ఆడవాళ్లకు ప్రధానంగా వేదించే సమస్య ఎండల్లో తిరగడం వలన ముఖంలో అందం తగ్గుతుందేమోనని. కొందరిలో ఎండలో తిరగడం వల్ల ముఖం కాంతిహీనంగా తయారవుతుంది. రకరకాలైన క్రీములు వాడినా ఒక్కోసారి ప్రయోజనం ఉండదు. మన ప్రకృతిలో సహజంగా లభించే గంధంలో చర్మానికి మేలు చేసే సుగుణాలెన్నో ఉన్నాయి. చర్మ ఛాయను మెరుగుపరచడం, మొటిమల్ని అదుపులో ఉంచడం వంటి లక్షణాలు గంధంలో ఉన్నాయి. మరి గంధాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. పాలతో గంధం చెక్కని అరగదీసి దానికి కాస్త పంచదార కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోయి కాంతివంతంగా కనిపిస్తుంది. 
 
2. సూర్యకిరణాల తాకిడికి ఎండ తగిలే శరీర భాగాలు రంగు మారుతుంటాయి.ఇలాంటప్పుడు పావుకప్పు గంధం పొడి, పావుకప్పు రోజ్ వాటర్, అరచెక్క నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా కనీసం రెండు సార్లయినా చేస్తుంటే సమస్య దూరమవుతుంది.
 
3. ముఖంపై మొటిమల తాలూకా మచ్చలు కలవరపెడుతుంటాయి. అలాంటివారు గంధం పొడిలో చెంచా పాలు, రెండు చుక్కల తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. ఆరాక కొన్ని నీళ్లు తీసుకుని తడుపుతూ మృదువుగా మర్దనా చేయాలి. తరువాత చల్లని నీటితో కడిగివేయాలి.ఇలా చేయడం వల్ల  మొటిమల సమస్య త్వరగా దూరమవుతుంది. అంతేకాకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనిజులా వెన్ను విరిచిన ఉచిత పథకాలు, ప్రజలకు ఉచితాలు ఇచ్చి సర్వనాశనం

స్థానిక ఎన్నికల్లో కూడా ఏపీ ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోంది.. జగన్ ఫైర్

ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలి.. నాదెండ్ల మనోహర్

APSRTC: సంక్రాంతి పండుగ కోసం 8,432 ప్రత్యేక బస్సులు : ఏపీఎస్సార్టీసీ

ఇక్కడే.. మీ కోసం ఎదురు చూస్తున్నా.. ట్రంప్‌‍కు కొలంబియా అధ్యక్షుడు సవాల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్ జరిగిందా?

శర్వా, సాక్షి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నారి నారి నడుమ మురారి

Sushmita: నాన్న గారు బరువు తగ్గడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు : సుస్మిత కొణిదెల

Rukmini Vasanth: టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌ లో రుక్మిణి వ‌సంత్ లుక్

Dil Raju: బొమ్మరిల్లు 2 తీయాలంటే ఆది, సాయి కుమార్ లతో తీయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments