వినాయక చవితి రోజున ఎరుపు రంగు గణనాథుడిని పూజిస్తే?

గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే వినాయక చవితి రోజున గణనాథుడిని పూజించాలని పండితులు చెప్తున్నారు. ఉద్యోగంలో స్థిరపడకపోవడం, వివాహ అడ్డంకులు, ఉద్యోగం చేసే ప్రదేశంలో సహచరుల నుంచి ఇబ్బందు

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (17:04 IST)
గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే వినాయక చవితి రోజున గణనాథుడిని పూజించాలని పండితులు చెప్తున్నారు. ఉద్యోగంలో స్థిరపడకపోవడం, వివాహ అడ్డంకులు, ఉద్యోగం చేసే ప్రదేశంలో సహచరుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే.. వినాయక చవితి రోజున బ్రాహ్మీ ముహూర్తమున నిద్రలేవాలి.


శరీరానికి నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుని.. అరగంట తర్వాత స్నానం చేయాలి. ఆపై ఎరుపు రంగు వినాయకుడిని పూజించాలి. స్వామి వారికి ఎరుపు రంగు పూల మాలతో అలంకరించాలి. 
 
ఉలవ గుగ్గుల్లు, పాలతో తయారు చేసిన ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి. దీపారాధనకు ముందుగా ''ఓం హరసూనవే నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత నేతితో దీపారాధన చేసి.. పూజకు తర్వాత ప్రసాదాలను పేదలకు దానం చేయాలి.

కనీసం బాలుడికైనా వస్త్రదానం చేయాలి. ఇంకా వినాయక ఆలయంలో ఆ రోజు మీకు చేతనైన సేవ చేస్తే మంచి ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గల్ఫ్‌లో 15లక్షల మంది తెలంగాణ ప్రజలు.. కంట్రోల్ రూమ్ సిద్ధం చేసిన సీఎం రేవంత్

నక్సలైట్ల ఏరివేతకు విషపూరిత షెల్స్‌ వినియోగం..?

గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్.. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం

ఎయిర్‌స్ట్రైక్‌లో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ హతం?

ఎంతో ఘనంగా జరిగిన రెండో పెళ్లి.. నాలుగో రోజే వరుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

01-03-2026 నుంచి 31-03-2026 వరకు మాస ఫలితాలు

TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ

28-02-2026 - శనివారం ఫలితాలు- మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం

27-02- 2026 శుక్రవారం ఫలితాలు : దూర ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు...

26-02-2026 గురువారం ఫలితాలు - కొత్త సమస్యలు తలెత్తకుండా...?

తర్వాతి కథనం
Show comments