స్పెషల్ స్టేటస్ డిమాండ్ : వైకాపా ఎంపీల రాజీనామాలు ఆమోదం

వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదముద్రవేశారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఐదుగురు

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (18:59 IST)
వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదముద్రవేశారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేసిన విషయం తెల్సిందే.
 
వాస్తవానికి ఈ రాజీనామాలు గత ఏప్రిల్ 6వ తేదీన చేశారు. ఆ తర్వాత ఈ రాజీనామాలను పరిశీలించిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్... ఆ ఐదుగురు ఎంపీలను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడారు. అపుడు కూడా రాజీనామాలకు కట్టుబడివున్నట్టు వారు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో వారి రాజీనామాలను స్పీకర్ గురువారం ఆమోదించారు. ఈ రాజీనామాలు చేసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), వరప్రసాద్ (తిరుపతి) మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు), మిథున్ రెడ్డి (రాజంపేట), వైఎస్ అవినాష్ రెడ్డి (కడప)లు ఉన్నారు. అయితే, వీరి రాజీనామాలు ఆమోదించినప్పటికీ.. ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహంచే అవకాశం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవును పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాను : త్రిష కౌంటర్

అమరావతిని ఏకైక రాజధాని.. ఏపీ ప్రజలందరికీ ఒక చారిత్రాత్మక విజయ క్షణం.బాలకృష్ణ

Allu Arjun: #AA22xA6 గురించి సన్ పిక్చర్స్ ప్రకటన

Dacoit: అమీర్ ఖాన్ మేనకోడలు... కెమెరామేన్ కళ్లకు కనిపించిన ఎద అందాలు.. వీడియో వైరల్

Suriya: గురు శిష్యుల సంబంధంగా సూర్య చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments