Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెషల్ స్టేటస్ డిమాండ్ : వైకాపా ఎంపీల రాజీనామాలు ఆమోదం

వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదముద్రవేశారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఐదుగురు

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (18:59 IST)
వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదముద్రవేశారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేసిన విషయం తెల్సిందే.
 
వాస్తవానికి ఈ రాజీనామాలు గత ఏప్రిల్ 6వ తేదీన చేశారు. ఆ తర్వాత ఈ రాజీనామాలను పరిశీలించిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్... ఆ ఐదుగురు ఎంపీలను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడారు. అపుడు కూడా రాజీనామాలకు కట్టుబడివున్నట్టు వారు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో వారి రాజీనామాలను స్పీకర్ గురువారం ఆమోదించారు. ఈ రాజీనామాలు చేసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), వరప్రసాద్ (తిరుపతి) మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు), మిథున్ రెడ్డి (రాజంపేట), వైఎస్ అవినాష్ రెడ్డి (కడప)లు ఉన్నారు. అయితే, వీరి రాజీనామాలు ఆమోదించినప్పటికీ.. ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహంచే అవకాశం లేదు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments