Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ ముందు రోబోలు బాలాదూర్.. రోబోలకే తాతవు : ఆనంద్ మహీంద్రా వీడియో షేర్

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (18:36 IST)
దేశ పారిశ్రామికవేత్తల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఈయన తన సామాజిక మాద్యమంలో షేర్ చేసే వీడియోలు చాలా ఫన్నీగానూ, కొత్తగానూ ఉంటాయి. మరికొన్ని ఆలోచింప‌జేసేవిగా ఉంటాయి. 
 
అయితే, ఆయ‌న ఏ వీడియో షేర్ చేసినా.. దాని నుంచి ఎంతో కొంత నేర్చుకునేది ఉంటుంది. అందుకే.. సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు ఫాలోయింగ్ ఎక్కువ‌. ఆయ‌న ఏదైనా ట్వీట్ చేస్తే చాలు.. వీడియో పెడితే చాలు ఆ ట్వీట్‌ను నెటిజన్లు క్ష‌ణాల్లో వైర‌ల్ చేసేస్తారు. 
 
తాజాగా ఆనంద్ మ‌హీంద్ర ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ దోశ బండి ద‌గ్గ‌ర దోశ‌లు వేసే వ్య‌క్తి స్కిల్ గురించి చెప్పుకొచ్చారు. "నీ ముందు రోబోలు ఏం ప‌నిచేస్తాయి.. రోబోల‌కే తాత‌వు నువ్వు.." అంటూ ఆనంద్ మ‌హీంద్ర వీడియోను షేర్ చేయగా, అది వైరల్ అయింది. 
 
ఆ వీడియోలో దోశ వేసే వ్య‌క్తి.. చాలా ఫాస్ట్‌గా దోశ‌లు వేస్తుంటాడు. దోశ‌లు ఎంత ఫాస్ట్‌గా అంటే.. అటు చూసి ఇటు చూసేలోపు.. దోశ‌లు ప్లేట్‌లో ప‌డిపోతున్నాయి. ఆ వీడియోకు ఫిదా అయిపోయిన ఆనంద్ మ‌హీంద్రా.. నీ స్కిల్ ముందు రోబోలు ఏం ప‌నిచేస్తాయి. 
 
వాటిక‌న్నా స్పీడ్‌గా ప‌నిచేసి వాటి ప‌నిని స్లో చేశావు. ఆయ‌న ప‌నిని చూసి నేనే అల‌సిపోయా.. కానీ.. అత‌డు ఎంతో ఉత్సాహంతో దోశ‌లు వేస్తున్నాడు. ఆయ‌న దోశ‌ల‌ను చూసి నాకు కూడా ఆక‌లివేస్తోంది.. అంటూ ట్వీట్ చేసి ఆ వీడియోను పోస్ట్ చేశారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments