Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజ‌వాడ‌లో రేషన్ కార్డులు తొలగిస్తారా? లేదు లేద‌న్న మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (18:28 IST)
రేషన్ కార్డులకు సంబంధించి ఈ-కేవైసీ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని, ఈ కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవమని విజ‌య‌వాడ న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి పేర్కొన్నారు.

ప్రస్తుతం మరే ఇతర రాష్ట్రాల్లోని లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలువుతున్నాయ‌ని, ఇపుడు రేష‌న్ కార్డులు ఎందుకు ఏరివేస్తార‌ని ఆమె ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో మొత్తం 1.48 కోట్ల రేషన్‌ కార్డుల్లో 4 కోట్ల మందికి పైగా కుటుంబ సభ్యులున్నార‌ని, వీరిలో 85 శాతం మంది ఈ-కేవైసీ వివరాలు నమోదయ్యాయ‌ని మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 35 లక్షల మందికిపైగా నమోదు చేయించుకోవాల్సి ఉంద‌ని అందుకే న‌మోదు చేప‌ట్టార‌ని చెప్పారు. విజ‌య‌వాడ న‌గ‌రంలో రేష‌న్ కార్డుదారులు 1,46,324 మంది ఉంటే, వారిలో 31,900 మంది ఈ-కేవైసీ వివరాలు నమోదయ్యాయ‌ని చెప్పారు. ఇంకా 1,14,424 మంది నమోదు చేయించుకోవాల్సి ఉందన్నారు.

ఈ నేప‌ధ్యంలో ప్ర‌జ‌లు ఈ-కేవైసీ కోసం మీ-సేవ, ఆధార్ కేంద్రాల వ‌ద్ద భారీగా చేర‌డంతో, కొంద‌రు వారి దగ్గర నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నార‌ని త‌న దృష్టికి వ‌చ్చింద‌ని మేయ‌ర్ చెప్పారు. ఈ విష‌యంపై ఫోన్‌లో సబ్ కలెక్టర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌తో మేయ‌ర్ మ‌ట్లాడారు. దీంతో స్పందించిన సబ్ కలెక్టర్‌ మ‌ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ - కె వై సి నమోదు చేస్తున్నాం అని చెప్పారు.

ప్రతి ఒక్కరు ఆధార్ డేటా తో ఈ - కె వై సి చేసుకోవాల‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌గ‌రంలో ఈ - కె వై సి కేంద్రాలు 71 ఉన్నాయ‌ని, మ‌రో రెండు సెంట‌ర్లు అదనంగా చేర్చ‌డం జ‌రిగింద‌ని, త‌ర్వ‌లో మ‌రో 10 కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు మేయ‌ర్‌కు ఫోన్‌లో వివ‌రించారు. ప్ర‌జ‌లు కోవిడ్ నియమాలు పాటిస్తూ, ఈ కె వైసీ చేసుకోవాల‌ని మేయ‌ర్ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments