Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖరీదైన కారులో మృతదేహం.. బెజవాడలో మిస్టరీ డెత్ కలకలం!

Advertiesment
Vijayawada
, గురువారం, 19 ఆగస్టు 2021 (13:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా ఉన్న బెజవాడలో ఓ మిస్టరీ డెత్ ఇపుడు కలకలం రేపుతోంది. ఖరీదైన కారులో ఉన్న ఆ మృతదేహం ఎవరిదన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
విజయవాడలోని డీవీ మ్యానర్ హోటల్ పక్క సందులో ఆగి ఉన్న కారు డ్రైవింగ్ సీటులో కుప్పకూలిన వ్యక్తిని స్థానిక పోలీసులు గుర్తించారు. జి. కొండూరులో గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఓనర్‌గా పోలీసులు చెప్తున్నారు.
 
అయితే, మీడియాకు అందిన సమాచారం ప్రకారం మృతుడు తాడిగడప‌కు చెందిన కరణం రాహుల్‌గా భావిస్తున్నారు. ఏపీ 16 ఎఫ్ఎఫ్ 9999 బ్లాక్ ఎండీవర్ కారులో మృతదేహం ఉన్నట్టుగా తెలుస్తుంది. వ్యాపారాల్లో విబేధాలు ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
మిస్టరీ డెత్‌గా కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్య లేక హత్య అన్నకోణంలో విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మృతదేహంపై గాయాలు లేకపోవడంతో మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో బుధవారం రాత్రి ఓ మిస్సింగ్ కేసు నమోదు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియల్‌మి జీటీ 5జి పేరిట కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌