మమ్మల్ని తిట్టడమే విపక్షాలకు పనైపోయింది.. కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు : కేటీఆర్

మా కుటుంబాన్ని నిత్యం తిట్టడమే ప్రతిపక్ష పార్టీలకు ఓ పనైపోయిందనీ అయినప్పటికీ.. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు.

Webdunia
బుధవారం, 2 మే 2018 (10:19 IST)
మా కుటుంబాన్ని నిత్యం తిట్టడమే ప్రతిపక్ష పార్టీలకు ఓ పనైపోయిందనీ అయినప్పటికీ.. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రగతి భవన్‌ పాటకీలు తెరుచుకోవడం లేదని, వాటిని బద్దలు కొడతామన్నారు.
 
సీఎం కేసీఆర్‌ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రగతి భవన్‌ పాటకీలు బద్దలు కొట్టడం కాదు. కేసీఆర్‌ వెంట్రుక కూడా పీకలేరు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ను, తమ కుటుంబ సభ్యులను తిట్టడమే ప్రతిపక్షాలకు పని అయిపోయిందని, చివరికి తమ కుటుంబంలోని  చిన్న పిల్లలను కూడా తిడుతున్నారని వాపోయారు. ఎవరు ఎన్ని తిట్టినా ప్రజలు అండదండలు పుష్కలంగా ఉన్నంత వరకు అవన్నీ తమకు దీవెనలే అవుతాయన్నారు. 
 
అలాగే, సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి. తెలంగాణకు తొలి సీఎం అయిన తర్వాత కార్మికుల కోసం ఎంతో చేస్తున్నారు. సమ్మెలు, ఆందోళనలు చేపట్టకుండా.. కనీసం వినతి పత్రాలు కూడా ఇవ్వకుండానే సమస్యలను పరిష్కరిస్తున్నారు. అంతమాత్రాన కార్మికులకు సమస్యలు లేవని నేను అనడం లేదు. కాస్త ఆలస్యమైనా ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం. గత పాలకుల హయాంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించారు. కేసీఆర్‌ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మరీ జీతాలు పెంచారని కేసీఆర్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments