టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఓబుల్ రెడ్డి కిడ్నాప్? అధికార పార్టీ చర్యేనంటూ తెదేపా

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (19:35 IST)
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని సామకోటవారిపల్లి పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కె. ఓబుల్ రెడ్డి గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి కనపడలేదని వారి ఇంటిలోని పనిమనిషి తెలిపారు. టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా పంచాయతీలో గెలుపు రేసులో ఉన్నందున అధికార పార్టీ నాయకులు ఓబుల్ రెడ్డిని కిడ్నాప్ చేసి ఎక్కడో ఉంచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఓబుల్ రెడ్డికి సంబంధించిన చొక్కా, చెప్పులు, సెల్ ఫోన్ అతని ఇంటిలోనే పడుకున్న మంచం వద్దనే ఉన్నట్లు తెలుస్తున్నది. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఓటమి భయంతో అధికార వైఎస్సార్ పార్టీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని అన్నారు.
 
ఎన్నడూ లేనివిధంగా నిమ్మనపల్లి మండలంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే వైసిపి నాయకులే కారణం అని తెలిపారు. పోలీసులు వెంటనే కిడ్నాప్ అయిన ఓబుల్ రెడ్డిని గుర్తించి సురక్షితంగా ఇంటికి వచ్చేలా చూడాలన్నారు. ఎస్సై లక్ష్మీనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వృషకర్మ

Pavala Shyamala: ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో పావలా శ్యామల..

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments