టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఓబుల్ రెడ్డి కిడ్నాప్? అధికార పార్టీ చర్యేనంటూ తెదేపా

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (19:35 IST)
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని సామకోటవారిపల్లి పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కె. ఓబుల్ రెడ్డి గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి కనపడలేదని వారి ఇంటిలోని పనిమనిషి తెలిపారు. టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా పంచాయతీలో గెలుపు రేసులో ఉన్నందున అధికార పార్టీ నాయకులు ఓబుల్ రెడ్డిని కిడ్నాప్ చేసి ఎక్కడో ఉంచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఓబుల్ రెడ్డికి సంబంధించిన చొక్కా, చెప్పులు, సెల్ ఫోన్ అతని ఇంటిలోనే పడుకున్న మంచం వద్దనే ఉన్నట్లు తెలుస్తున్నది. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఓటమి భయంతో అధికార వైఎస్సార్ పార్టీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని అన్నారు.
 
ఎన్నడూ లేనివిధంగా నిమ్మనపల్లి మండలంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే వైసిపి నాయకులే కారణం అని తెలిపారు. పోలీసులు వెంటనే కిడ్నాప్ అయిన ఓబుల్ రెడ్డిని గుర్తించి సురక్షితంగా ఇంటికి వచ్చేలా చూడాలన్నారు. ఎస్సై లక్ష్మీనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devi Sri Prasad: ఎల్లమ్మ తో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్‌లో అమీర్ లోగ్ సాంగ్

Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్

ఫిబ్రవరి 14న వివాహం చేసుకోబోతున్న ధనుష్, మృణాల్ ఠాకూర్?

Nabha Natesh: నాగబంధం నుంచి పార్వతిగా సాంప్రదాయ లుక్ లో నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

తర్వాతి కథనం
Show comments