Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాప్‌లెస్‌ ఫోటో పోస్ట్ చేసిన హీరో వైఫ్... గర్వంగా ఫీలైన హీరో

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:34 IST)
సెలబ్రిటీలు, సామాన్యులు అంటూ తేడా లేకుండా దాడి చేస్తున్న మహమ్మారి క్యాన్సర్. ఇప్పటికే చాలామంది ప్రముఖులు దీని బారినపడి కష్టమైన ట్రీట్మెంట్ దశను ధైర్యంగా దాటుకుని బయటపడ్డారు. ఆ తర్వాత కొంతమంది సంతోషంగా జీవిస్తూ ఉంటే మరికొందరు దీని గురించి అవగాహన కల్పించడానికి పోరాడుతున్నారు. 
 
ఇటీవలి కాలంలో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్యకు క్యాన్సర్ స్టేజ్ 0 సోకినట్లు గత ఏడాది నవంబర్‌లో నిర్ధారణ అయ్యింది. ఆమె పేరు తాహీరా కశ్యప్, అప్పటి నుండి బ్రెస్ట్ క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ పొందుతోంది. ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆవిడ చేసిన ట్వీట్ హృదయాలను హత్తుకునే విధంగా ఉంది. 
 
"ఈరోజు నాది! అందరికీ ప్రపంచ క్యాన్సర్ డే శుభాకాంక్షలు, ఈ రోజును మనమంతా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. నా ఒంటిపై ఉన్న ఈ మచ్చలను గౌరవ చిహ్నాలుగా భావిస్తున్నాను. ఇది చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఈ చిత్రం నా నిర్ణయం, ఎందుకంటే ఈ సందర్భంగా నేను నా వ్యాధిని కాకుండా దానిపై నా పోరాట స్ఫూర్తిని తెలియజెప్పాలనుకుంటున్నాను" అంటూ టాప్‌లెస్‌గా గుండుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. 
 
దీనిపై స్పందిస్తూ ఖురానా "ఈ మాటలు నీకోసమే తాహిరా.. ఈ మచ్చలు చాలా అందంగా ఉన్నాయి.. ఇలాగే నువ్వు కోట్ల మందిని తమ యుద్ధాలను ధైర్యంగా కొనసాగించడానికి స్ఫూర్తిగా నిలవాలి" అంటూ ట్వీట్ చేసారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments