Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాప్‌లెస్‌ ఫోటో పోస్ట్ చేసిన హీరో వైఫ్... గర్వంగా ఫీలైన హీరో

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:34 IST)
సెలబ్రిటీలు, సామాన్యులు అంటూ తేడా లేకుండా దాడి చేస్తున్న మహమ్మారి క్యాన్సర్. ఇప్పటికే చాలామంది ప్రముఖులు దీని బారినపడి కష్టమైన ట్రీట్మెంట్ దశను ధైర్యంగా దాటుకుని బయటపడ్డారు. ఆ తర్వాత కొంతమంది సంతోషంగా జీవిస్తూ ఉంటే మరికొందరు దీని గురించి అవగాహన కల్పించడానికి పోరాడుతున్నారు. 
 
ఇటీవలి కాలంలో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్యకు క్యాన్సర్ స్టేజ్ 0 సోకినట్లు గత ఏడాది నవంబర్‌లో నిర్ధారణ అయ్యింది. ఆమె పేరు తాహీరా కశ్యప్, అప్పటి నుండి బ్రెస్ట్ క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ పొందుతోంది. ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆవిడ చేసిన ట్వీట్ హృదయాలను హత్తుకునే విధంగా ఉంది. 
 
"ఈరోజు నాది! అందరికీ ప్రపంచ క్యాన్సర్ డే శుభాకాంక్షలు, ఈ రోజును మనమంతా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. నా ఒంటిపై ఉన్న ఈ మచ్చలను గౌరవ చిహ్నాలుగా భావిస్తున్నాను. ఇది చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఈ చిత్రం నా నిర్ణయం, ఎందుకంటే ఈ సందర్భంగా నేను నా వ్యాధిని కాకుండా దానిపై నా పోరాట స్ఫూర్తిని తెలియజెప్పాలనుకుంటున్నాను" అంటూ టాప్‌లెస్‌గా గుండుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. 
 
దీనిపై స్పందిస్తూ ఖురానా "ఈ మాటలు నీకోసమే తాహిరా.. ఈ మచ్చలు చాలా అందంగా ఉన్నాయి.. ఇలాగే నువ్వు కోట్ల మందిని తమ యుద్ధాలను ధైర్యంగా కొనసాగించడానికి స్ఫూర్తిగా నిలవాలి" అంటూ ట్వీట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments