Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో రోజా-విశాల్, ఎవరితో ఫోటోలు తీసుకోవాలో తెలియక..?

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (17:06 IST)
తిరుమలలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా తిరుమల అంటేనే ప్రముఖులు వస్తుంటారు. ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అయితే దీపావళి పర్వదినం సందర్భంగా తిరుమలకు ఇద్దరు ప్రముఖులు రావడం..ఎవరితో సెల్ఫీలు తీసుకోవాలో తెలియక భక్తులు ఆలోచనలో పడిపోవడం కనిపించింది.

 
తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున విఐపి విరామ దర్సనా సమయంలో సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజాతో పాటు నటుడు విశాల్‌లు దర్సించుకున్నారు. వేర్వేరుగా శ్రీవారి సేవలో వీరు పాల్గొన్నారు. అయితే ఆలయం బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరూ ఒకేసారి కలిసి వచ్చారు. 

 
సినీప్రముఖులు లోపల ఉన్నారన్న విషయం తెలుసుకున్న భక్తులు ఆలయం బయట క్యూకట్టారు. రోజాతో పాటు విశాల్‌తో ఫోటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఇద్దరు సినీప్రముఖులు వెళ్ళిపోతుండడంతో భక్తులు ఎవరితో ఫోటోలు దిగాలో తెలియక తికమకపడ్డారు.

 
కానీ రోజా మాత్రం అడిగిన వారికందరికీ సెల్ఫీలకు అవకాశమిస్తూ ముందుకు సాగారు. విశాల్ కూడా దూరం నుంచి అభిమానులను ఫోటోలు తీసుకోమని సూచించారు. సుమాఉ 20 నిమిషాల పాటు శ్రీవారి ఆలయం ముందు సినీప్రముఖుల సందడి కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments