Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కకు పూనీత్ రాజ్ కుమార్ పేరు పెట్టిన విశాల్

Advertiesment
Green India Challenge
, సోమవారం, 1 నవంబరు 2021 (18:53 IST)
Vishal-Arya-mrinalini ravi
మొక్కల యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. కాలాల్ని, సంస్కృతుల్ని, స్మృతుల్ని తనలో మిలితం చేసుకొని సరికొత్తగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. అందులో భాగంగానే  ఇవ్వాల “ఎనిమీ” సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సినీ నటులు విశాల్, ఆర్య, నటి మిర్నాళిని రవి “గ్రీన్ ఇండియా చాలెంజ్” లో భాగంగా హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
 
అనంతరం విశాల్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రభుత్వ మానసపుత్రిక “హరితహారం” స్పూర్తితో ప్రారంభించిన “గ్రీన్ ఇండియా చాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో వారు ప్రారంభించిన ఈ “గ్రీన్ ఇండియా చాలెంజ్” గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే  ప్రతి ఒక్కరు బాధ్యతగా “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. అంతేకాదు తన స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ గుర్తుగా ఈరోజు మొక్కని నాటుతున్నానని.. ఈ మొక్క తన స్నేహితునికి గుర్తుగా ఉంటుందని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో నటుడు ఆర్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగస్వామ్యం అయి మొక్కలు నాటడం ఆనందంగా ఉందని భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు విదిగా మొక్కలు నాటాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి నటుడు ఆర్య ధన్యవాదాలు తెలిపారు.
 
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాల్సిందిగా నటి మిర్నాళిని రవి కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషాన్నిచ్చిందని అన్నారు.   అనంతరం “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని ఎనిమీ చిత్ర బృందానికి అందజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవంబర్ 26న కీర్తి సురేష్- గుడ్‌ల‌క్ స‌ఖి