ఏ కాంగ్రెస్ వితంతువు అకౌంట్లోకి అంత మొత్తం చేరిందో?: నరేంద్ర మోదీ

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (10:29 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతవారంలో రాజస్థాన్‌లో పర్యటనలో భాగంగా.. మోదీ ఓ ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేగాకుండా మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించినవని నెట్టించ రచ్చ రచ్చ జరుగుతోంది.


ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు, నెటిజన్లు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ప్రధానిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలను మోదీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇంతకీ మోదీ చేసిన వ్యాఖ్యల సంగతికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు పాల్పడిందని.. వితంతు ఫించన్ పథకం అందులో ఒకటని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ఏ కాంగ్రెస్ వితంతువు అకౌంట్లోకి ఈ మొత్తం చేరిందోనని కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన సీడబ్ల్యూసీ సభ్యుడు సిద్ధరామయ్య.. ప్రధాని దిగజారుడుతనానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని ఫైర్ అయ్యారు. 
 
ఇలాంటి మాటలతో ప్రధాని తన పదవికే కళంకం తెచ్చారని.. మహిళలందరీ ఆయన అవమానపరిచేలా వ్యాఖ్యానించారని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments