Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుట్టుచప్పుడుకాకుండా #MasoodAzhar విడుదల

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (11:07 IST)
జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను పాకిస్థాన్ గుట్టుచప్పుడు కాకుండా విడుదల చేసింది. దీంతో ఉగ్రవాదంపై తమబుద్ధి ఏమాత్రం మారబోదని తేల్చి చెప్పింది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఆదేశం మేరకు మసూద్ అజర్‌ను పాకిస్థాన్ ఇటీవల అరెస్టు చేసింది. 
 
అయితే, ఆయన్ను ఇపుడు పాకిస్థాన్ రహస్యంగా విడుదల చేసింది. ఈ మేరకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి సమాచారం అందింది. భారత్-పాక్ సరిహద్దులోని రాజస్థాన్ - కాశ్మీర్ సెక్టారులో పెద్ద కుట్రకు పాక్ పావులు కదుపుతోందన్న ఐబీ సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణ 370ని రద్దు చేసిన విషయం తెల్సిందే. దీన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేక పోతోంది. 
 
పైగా, భారత్‌ను అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్ సరిహద్దులో భారీ స్థాయిలో ఆర్మీని మోహరించింది. భారత్‌కు ధీటైన సమాధానం ఇస్తామని ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ హెచ్చరించారు. అందులో భాగంగానే ఇప్పుడు మసూద్‌ను వదిలిపెట్టినట్టు ఐబీ భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments