Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యవసాయం పట్ల యువత ఆసక్తి చూపకపోవడం ప్రమాదకరం : జగ్గీవాసుదేవ్

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (09:26 IST)
దేశ యువత వ్యవసాయం పట్ల ఆసక్తి చూపించకపోవడం చాలా ప్రమాదకరమని ప్రముఖ ఆధ్యాత్మిక యోగి, సద్గురు జగ్గీ వాసుదేవ్ అభిప్రాయపడ్డారు. పైగా, అత్యంత సారవంతమైన మన దేశ మట్టిని పోగొట్టుకున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
జగ్గీ వాసుదేవ్ ఇచ్చిన 'కావేరీ పిలుస్తోంది' ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ ఉద్యమానికి కర్ణాటక సీఎం యడ్యూరప్ప మద్దతు తెలిపారు. బెంగళూరులో నిర్వహించిన చైతన్య సదస్సులో యడ్యూరప్ప, జగ్గీ వాసుదేవ్, మైసూరు సంస్థాన రాజమాత ప్రమోదాదేవి, ప్రముఖ పారిశ్రామిక వేత్త కిరణ్ మజుందార్ షా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా జగ్గీ వాసుదేవ్ మాట్లాడుతూ, కావేరీలో నీటి లభ్యత క్రమేపీ తగ్గిపోతోందని, అందువల్లే కర్ణాటక, తమిళనాడులో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. నదీ తీరంలో వృక్షాలు పెంచి రైతులకు ఆదాయం పెంచడం లక్ష్యం కావాలని, చెట్లు, పశువులు అటవీ ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. 
 
ముఖ్యంగా, వ్యవసాయానికి విపరీతంగా ఎరువులను వాడుతున్నారనీ, ఇది అనేక అనేక ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. యూరియాను మోతాదుకు మించి వాడటం వల్ల సారవంతమైన భూమిని కోల్పోతున్నామని చెప్పారు. మన దేశంలో జలాశయాలు మూడు, నాలుగు రోజుల్లోనే నిండుతున్నాయని, నీరు వేగంగా సముద్రంలోకి వెళ్లిపోయి, మన ప్రాంతాలు ఎడారిగా మారకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. 'కావేరీ' ఒక్కటే కాదు 120కి పైగా ఉపనదులు పునర్జీవం కావాలని వాసుదేవ్ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments