మాతాజీ - పితాజీల కంటే ఏ "జీ" గొప్పది కాదు : ముఖేశ్ అంబానీ

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2022 (10:54 IST)
ప్రతి ఒక్కరి జీవితాల్లో అమ్మానాన్నలే గొప్ప అని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. మాతాజీ, పితాజీ కంటే 4జీ, 5జీలు గొప్పది కాదన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని పండిట్ దీన దయాళ్ ఎనర్జీ యూనివర్శిటీ స్నాతకోత్సవం కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇది మీ రోజని, మీరేంటో ప్రపంచానికి తెలిసే రోజన్నారు. అయినప్పటికీ మీరు నిల్చున్నది మీ తల్లిదండ్రుల రెక్కలపై అని చెప్పారు. మీ తల్లిదండ్రులకు కూడా ఈ రోజు ప్రత్యేకమైనదన్నారు. 
 
మిమ్మల్ని ఇక్కడికి వరకు తీసుకురావడానికి మీ తల్లిదండ్రులు చేసిన త్యాగాలను, వారు పడిన శ్రమను మరిచిపోవద్దన్నారు. మీకు వాళ్లు ఎపుడూ అండగా ఉంటారన్నారు. మీ బలానికి మూలస్తంభాలు వారేనని చెప్పారు. 
 
ప్రస్తుతం యుత 4జీ, 5జీల గురించి ఉత్సాహంగా ఉన్నారన్నారు. కానీ, మాతాజీ, పితాజీల టంకే ఏ జీ గొప్పది కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తె న్యూడ్ ఫోటోలు అడిగారు: నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన

ముగిసిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నిశ్చితార్థం

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments