Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రిపై కారప్పొడి దాడి... ఎక్కడ.. ఎవరు?

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (18:13 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కారప్పొడి దాడి జరిగింది. ఢిల్లీలో జరిగిన ఈ దాడిలో ఆయనకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, సాక్షాత్తూ ఢిల్లీ సచివాలయంలోనే ఈ దాడి జరగడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో కారప్పొడితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 
 
మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ తన ఛాంబర్ నుంచి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో కాపుకాచి అక్కడే ఉన్న అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో సీఎం చాంబర్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నంలో తోపులాట కూడా జరిగింది. ఈ ఘర్షణలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కళ్లజోడు కూడా పగిలిపోయింది. 
 
కాగా, నిందితుడు అనిల్ కుమార్ భార్య సచివాలయంలోనే పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిందితుడు ఎందుకు దాడిచేశాడన్నది తెలియడంలేదు. కాగా, ఇది దారుణమైన భద్రతా వైఫల్యమని ఆప్ పార్టీ విమర్శించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments