Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధువు తల్లితో వరుడి తండ్రి పరార్: ఔను వాళ్లిద్దరూ ఇప్పుడు తిరిగొచ్చారు

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (16:47 IST)
గుజరాత్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుందనగా వధువు తల్లితో కలిసి వరుడు తండ్రి పరారైన సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో పెళ్లనగా వీరిద్దరూ జనవరి 3వ వారంలో జంప్ అయ్యారు. దీనితో పెళ్లి ఆగిపోయింది. 
 
లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే... పారిపోయిన ఓల్డ్ కపుల్ ఈ వాలెంటైన్ డే సందర్భంగా ఓ నిర్ణయానికి వచ్చారట. దాదాపు మూడు వారాల పాటు ఎక్కడో ఏకాంతంగా గడిపిన వీరిద్దరూ తిరిగి తమ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చేయాలని నిర్ణయించుకుని సూరత్ తిరిగి వచ్చారు. 
 
ఇలా వచ్చినవారిలో వధువు తల్లికి చేదు అనుభవం ఎదురుకాగా వరుడు తండ్రికి మాత్రం ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. తిరిగి వచ్చిన వరుడు తండ్రికి అతడి భార్యాపిల్లలు ఎలాంటి కండిషన్లు పెట్టలేదు, ఏదో అలా జరిగిపోయిందంటూ సర్దుకున్నారు. కానీ వధువు తల్లిని చూసిన ఆమె భర్త కస్సున లేచాడు. ఎవరివద్దో వారాలు ఏకాంతంగా గడిపిన ఆమెను ఏలుకునేందుకు నేను సిద్ధంగా లేనంటూ ముఖం మీదే చెప్పేశాడు. 
 
ఆమె అతడితో లేచిపోయినప్పుడే తనకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదని చెపుతున్నాడు. కాగా ఇలా పారిపోయిన కపుల్ 27 ఏళ్ల క్రితం ప్రేమికులట. అప్పట్లో వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఇలా ఇప్పుడు కలిసి జంప్ అయ్యారు. కానీ సమాజం అనేక రకాలుగా మాట్లాడుకుంటుండటంతో ఆ మాటలను తట్టుకోలేని ఈ జంట తిరిగి వచ్చేసింది. వధువు తల్లిని ఆమె భర్త అంగీకరించని నేపధ్యంలో ఆమె బాధ్యతను తనే చూసుకుంటానంటూ లేపుకెళ్లిన మాజీ ప్రేమికుడు చెప్పడం కొసమెరుపు.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments