Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూరత్‌లో భాగీ అగ్నిప్రమాదం.. 19 మంది మృతి.. 3వ అంతస్తునుంచి దూకి....

సూరత్‌లో భాగీ అగ్నిప్రమాదం.. 19 మంది మృతి.. 3వ అంతస్తునుంచి దూకి....
, శుక్రవారం, 24 మే 2019 (19:08 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కోచింగ్ సెంటర్‌లో సంభవించిన ఈ ప్రమాదంలో యువతీయువకులు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు నాలుగో అంతస్తుల భవనం నుంచి కిందికి దూకేశారు. ఫలితంగా ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ ట్యూటర్ కూడా ఉన్నారు. ప్రాణాలు కాపాడుకొనేందుకు వీరంతా నాలుగో అంతస్థు నుంచి కిందికి దూకారు. 
 
ఈ అగ్నిప్రమాదం సర్తానాలోని తక్షశిల కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది. అయితే ఈ భవనంలోని మూడో అంతస్తులో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. మంటల నుంచి తప్పించుకునేందుకు పలువురు విద్యార్థులు కిందకు దూకారు. 
 
దీంతో పలువురి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలను ఆర్పేందుకు 18 ఫైరింజన్లు శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సూరత్ పోలీసు కమిషనర్ తెలిపారు. మృతులంతా 15 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారే. 
 
ఈ అగ్నిప్రమాద ఘటనపై నరేంద్ర మోడీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మోడీ ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని విజయ్ రూపానీ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గెలుపోటములు సహజమే... ప్రజల కోసం పని చేస్తాం : నారా లోకేశ్