Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖను ఇక ఆ దేవుడే రక్షించాలి : కేశినేని నాని

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (11:06 IST)
విశాఖపట్టణాన్ని ఇక ఆ దేవుడే రక్షించాలని తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. దీనిపై రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన 29 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
ఇదే అంశంపై కేశినేని నాని స్పందిస్తూ, "పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారత దేశ సైన్యం వుంది. కాని విశాఖకు అసలు ముప్పు ప్రస్తుతం మన జగన్నన అండ్ గ్యాంగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే. వీళ్ళ నుండి విశాఖను దేవుడే రక్షించాలి" అని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. 
 
ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ఓ దినపత్రికలో "విశాఖపై పాకిస్థాన్ కన్నెందుకు?" అంటూ ప్రచురితమైన ఓ కథనాన్ని ఉంచారు. పాకిస్థాన్ నుంచి విశాఖకు ముప్పేమీ లేదని చెబుతూ, అసలు ముప్పు వైసీపీ నుంచేనని విమర్శించారు.

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments