Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబడ్డీ ఆటగాళ్ళకు అవమానం.. బాత్రూమ్‌లో ఆహారం

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (14:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కబడ్డీ ఆటగాళ్లకు వడ్డించే ఆహారాన్ని మరుగుదొడ్డిలో భద్రత పరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షహరాన్‌పూర్ జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో ఈ సంఘటన వెలుగు చూసింది. కబడ్డీ ఆటగాళ్ళ కోసం తయారు చేసిన వంటపాత్రలను బాత్రూమ్‌లో భద్రపరిచారు. ఇది ప్రతి ఒక్కరినీ షాకింగ్‌కు గురిచేసింది.
 
జాతీయ మీడియా కథనాల మేరకు.. ఇక్కడ జరిగే ఉమన్స్ కబడ్డీ టోర్నమెంట్‌లో దాదాపు 300 మంది ఆటగాళ్ళు పాల్గొన్నారు. వీరి కోసం సిద్ధం చేసిన వంట పాత్రలను బాత్రూమ్‌లో భద్రపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవవుతోంది. ఈ వంట పాత్రల నుంచి కొందరు ఆటగాళ్ళు ఆహారాన్ని తీసుకుంటున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. 
 
దీనిపై అధికారులు స్పందిస్తూ, స్టేడియంలో స్థలాభావం కారణంగా వంటపాత్రలను అక్కడ పెట్టాల్సివచ్చిందని నిర్లక్ష్యపూరితంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా ఈ వీడియోలు వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. క్రీడా అధికారి అనిమేష్ సక్సేనాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments