Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబడ్డీ ఆటగాళ్ళకు అవమానం.. బాత్రూమ్‌లో ఆహారం

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (14:48 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కబడ్డీ ఆటగాళ్లకు వడ్డించే ఆహారాన్ని మరుగుదొడ్డిలో భద్రత పరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షహరాన్‌పూర్ జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో ఈ సంఘటన వెలుగు చూసింది. కబడ్డీ ఆటగాళ్ళ కోసం తయారు చేసిన వంటపాత్రలను బాత్రూమ్‌లో భద్రపరిచారు. ఇది ప్రతి ఒక్కరినీ షాకింగ్‌కు గురిచేసింది.
 
జాతీయ మీడియా కథనాల మేరకు.. ఇక్కడ జరిగే ఉమన్స్ కబడ్డీ టోర్నమెంట్‌లో దాదాపు 300 మంది ఆటగాళ్ళు పాల్గొన్నారు. వీరి కోసం సిద్ధం చేసిన వంట పాత్రలను బాత్రూమ్‌లో భద్రపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవవుతోంది. ఈ వంట పాత్రల నుంచి కొందరు ఆటగాళ్ళు ఆహారాన్ని తీసుకుంటున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. 
 
దీనిపై అధికారులు స్పందిస్తూ, స్టేడియంలో స్థలాభావం కారణంగా వంటపాత్రలను అక్కడ పెట్టాల్సివచ్చిందని నిర్లక్ష్యపూరితంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా ఈ వీడియోలు వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. క్రీడా అధికారి అనిమేష్ సక్సేనాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments