దిశ హత్య కేసు: నేరస్తులను 'మహానది' సింగిల్ సెల్‌కు తరలించిన పోలీసులు, ఏమిటీ సింగిల్‌ సెల్‌?

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (19:00 IST)
ప్రమాదకరంగా ఉండే రిమాండ్‌ ఖైదీలతో పాటు జైలు సిబ్బందితో గొడవపడే ఖైదీలను సింగిల్‌ సెల్స్‌కు మార్చడం చర్లపల్లి జైలులో తరచూ జరిగే పరిణామమే. తోటి ఖైదీల నుంచి హాని ఉన్న ఖైదీలను కూడా ఈ సింగిల్‌ సెల్స్‌కు మారుస్తుంటారు. పశువైద్యురాలిపై పైశాచికత్వం ప్రదర్శించిన నలుగురు నిందితులను ఈ కారణంతోనే సింగిల్‌ సెల్‌కు మార్చారు. 
 
చర్లపల్లి జైల్లో ఖైదీలను ఉంచేందుకు మూడు అంతస్తుల్లో మూడు బ్యారక్‌లు ఉంటాయి. ఒక్కో బ్యారక్‌లో నాలుగు నుంచి ఎనిమిది హాళ్లుంటాయి. ఒక్కో హాల్‌లో 16 నుంచి 30 మంది దాకా ఖైదీలుంటారు. జైలు వేళల్లో వారికి కేటాయించిన పనులు చేసుకొని వచ్చే ఖైదీలు ఈ హాళ్లలోనే నిద్ర పోతుంటారు. సింగిల్‌ సెల్స్‌ వీటికి భిన్నంగా ఉంటాయి. వీటిలో ముందువైపు తలుపునకు కటకటాలు, వెనక వైపు దాదాపు 13 అడుగుల ఎత్తులో ఒక వెంటిలేటర్‌ మాత్రమే ఉంటాయి. 
 
అందులోనే ఒక మూల కాలకృత్యాలు తీర్చుకునేందుకు వీలుగా గోడచాటుగా ఉండే బాత్‌రూం మాత్రమే ఉంటుంది. జైలులోని ఇతర విషయాలేవీ వీరికి తెలిసే అవకాశం ఉండదు. సమయానికి టిఫిన్‌, టీ, భోజనం మాత్రం అందిస్తారు. చీకటి కొట్టులాంటి సింగిల్‌ సెల్‌లోని ఖైదీలు ఎలాంటి అఘాయిత్యానికి, ఆత్మహత్యా యత్నానికి పాల్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. 
 
స్పూను, గ్లాసు, ప్లేటు లాంటివే కాకుండా బాత్‌రూంలో కనీసం బకెట్‌ కూడా ఉండకుండా చూస్తారు. కారిడార్‌లో ఉండే విద్యుత్‌ దీపమే వారికి రాత్రి వేళ గుడ్డి వెలుగునిస్తుంది. ప్రస్తుతం నిందితులు ఉన్న మహానది బ్యారక్‌లోని సింగిల్‌ సెల్స్‌లోనే గతంలో మొద్దు శ్రీను హత్య కేసులో నిందితుడైన ఓంప్రకా‌ష్‌ను ఉంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bramhi: కామెడీ, మిస్టరీ అంశాల‌తో మేము‘కాప్’లం ట్రైల‌ర్‌ కు బ్రహ్మానందం కితాబు

Kiran: తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం నిర్మాతగా నాకెంతో సంతృప్తినిచ్చింది - కిరణ్ అబ్బవరం

Durgesh: ఆంధ్ర సినీ రాజధానిగా తిరుపతి - కందుల దుర్గేష్‌ ని కలిసిన పారడాక్స్ పిక్చర్స్ అధినేతలు

ఐదు సూత్రాల చుట్టూ తిరిగే జీవితనేపథ్యంగా ఏదైనా సాధ్యమే మూవీ

'జన నాయగన్' నిర్మాతకు తమిళనాడు సీఎం విజయ్ నుంచి పిలుపు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments