Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెగాసస్ లక్ష్య జాబితాలో అనిల్ అంబానీ

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (10:35 IST)
ఇజ్రాయెల్‌కు చెందిన స్పైస్ సంస్థ పెగాసస్ లక్ష్య జాబితాలో దేశానికి చెందిన అనేక మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సిబిఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ, దసాల్ట్ ఏవియేషన్ ప్రతినిధి వెంకట రావు ఇలా అనేక మంది ఉన్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. 
 
వీరితో పాటు ఫాబ్ ఇండియా మాజీ హెడ్ ఇందర్ జిత్ సియాల్, బోయింగ్ ఇండియా బాస్ ప్రత్యూష్ కుమార్ తదితరులు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు ‘వైర్’ తెలిపింది. అనిల్ అంబానీ ఫోన్ కూడా పెగాసస్ లిస్టులో ఉన్నట్టు వచ్చిన వార్తలపై రిలయన్స్ గ్రూప్ ఇంకా స్పందించలేదు. అయితే ఈ వార్తలను పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. 
 
కాగా, దేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మరో ఇద్దరు కేంద్ర మంత్రులు, సుమారు 40 మంది జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు సహా మొత్తం 300 మంది పెగాసస్ లిస్టులో ఉన్నట్టు వచ్చిన వార్తలు దేశాన్ని కుదిపివేస్తున్నాయి. దీనిపై పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విరుచుక పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments