Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూమికి మరో ముప్పు : దూసుకొస్తున్న గ్రహశకలం

భూమికి మరో ముప్పు : దూసుకొస్తున్న గ్రహశకలం
, గురువారం, 22 జులై 2021 (18:16 IST)
భూమికి మరో ముప్పు పొంచివుంది. ఓ గ్రహ శకలం మెరుపు వేగంతో భూమివైపు దూసుకొస్తుంది. ఇది ఈ నెల 24వ తేదీన భూమిని దాటి వెళ్లిపోవచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్ల‌డించింది. దీనికి 2008 గో20గా నామకరణం చేశారు.
  
ఈ గ్రహశకలం ఓ స్టేడియం ప‌రిమాణం లేదా తాజ్‌మ‌హ‌ల్ కంటే మూడు రెట్లు పెద్ద‌గా ఉంద‌ని నాసా శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. గంట‌ల‌కు 18 వేల మైళ్ల వేగంతో అంటే సెక‌ను 8 కిలోమీట‌ర్ల వేగంతో ఇది భూమి వైపు దూసుకొస్తున్న‌ట్లు నాసా చెప్పింది.
 
ఈ స్పీడు కార‌ణంగా ఆస్ట‌రాయిడ్‌కు అడ్డుగా వ‌చ్చే ఏదైనా ధ్వంస‌మైపోతుంద‌ని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఆస్ట‌రాయిడ్ వ్యాసం 220 మీట‌ర్లుగా ఉంది. ఇది భూమికి 28 ల‌క్ష‌ల‌ కిలోమీట‌ర్ల దూరం నుంచి వెళ్ల‌నుంది.
 
అంటే ఇది భూమి, చంద్రుడికి మ‌ధ్య ఉన్న దూరం కంటే ఎనిమిది రెట్లు. అయితే ఈ ఆస్ట‌రాయిడ్ సుర‌క్షితంగా భూమిని దాటి వెళ్లిపోతుంద‌ని నాసా తెలిపింది. అయితే ఈ ఆస్ట‌రాయిడ్ క‌క్ష్య‌ను అపోలోగా వ‌ర్గీక‌రించారు. ఈ కేట‌గిరీ ఆస్టరాయిడ్లు చాలా ప్ర‌మాద‌క‌రం. దీంతో ఈ ఆస్ట‌రాయిడ్ క‌ద‌లిక‌ల‌ను నాసా చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిభావంతులైన ఉద్యోగులకు బెంజ్ కారు.. హెచ్‌సీఎల్ బంపరాఫర్