Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.18.70 కోట్లు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు శోభాయమానంగా జరిగాయి. ఆదివారం ఉదయంతో జరిగిన చక్రస్నానంతో ఈ వేడుకలు ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (20:02 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు శోభాయమానంగా జరిగాయి. ఆదివారం ఉదయంతో జరిగిన చక్రస్నానంతో ఈ వేడుకలు ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.18.70 కోట్లుగా వచ్చినట్టు చెప్పారు. 
 
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలు, మూలవిరాట్ దర్శనం కల్పించామని చెప్పారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సూచనలు చేశారని తెలిపారు. 
 
ఈ బ్రహ్మోత్సవాల్లో 6.27 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని, రూ.18.70 కోట్ల హుండీ ఆదాయం లభించిందని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం తగ్గిందన్నారు. 
 
23 లక్షల మందికి అన్న ప్రసాదం, 26.55 లక్షల లడ్డూలు పంపిణీ చేశామని,3.06 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. 
 
ఈ నెల 18, 25 తేదీల్లో నాలుగు వేల మంది వయోవృద్ధులు, వికలాంగులకు, ఈ నెల 19, 26 తేదీల్లో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments