Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయిన రష్మీ... "నెక్స్ట్ నువ్వే" ట్రైలర్

వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్న బుల్లితెర ప్రభాకర్, ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఒక హారర్ థ్రిల్లర్ కామెడీ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని వీ4 మూవీస్ పతాకంపై నిర్మాత బన్నీ వాసు నిర్మించాడు. ఈ

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (15:04 IST)
వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్న బుల్లితెర ప్రభాకర్, ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఒక హారర్ థ్రిల్లర్ కామెడీ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని వీ4 మూవీస్ పతాకంపై నిర్మాత బన్నీ వాసు నిర్మించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
 
ఆదికి జంటగా వైభవి నటించగా, ఈ చిత్రంలో రష్మీ ఒక కీలకమైన పాత్రను పోషించింది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ప్రధాన పాత్రధారులను కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను రూపొందించారు. 
 
కామెడీ .. ఎమోషన్ .. సస్పెన్స్ .. హారర్‌కి సంబంధించిన సీన్స్‌పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. నలుగురు స్నేహితులు కలిసి పెట్టిన ఒక హోటల్ నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. ఈ ట్రైలర్‌లో రష్మీ డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయింది. కాగా, ఈ చిత్రం నవంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీత బాణీలను సాయి కార్తీక్ సమకూర్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments