Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత కథకు గ్రామీణ అందాలు 'నెల్లూరి పెద్దారెడ్డి' రివ్యూ

సతీష్‌ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్‌ హీరో హీరోయిన్లుగా విజే రెడ్డి దర్శకత్వంలో రఘునాథ రెడ్డి నిర్మించిన చిత్రం 'నెల్లూరి పెద్దారెడ్డి'. ప్రభాస్‌ శ్రీను, అంబటి శ్రీను, సమ్మెట గాంధీ తదితరులు నటించిన ఈ చిత్

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (17:55 IST)
సతీష్‌ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్‌ హీరో హీరోయిన్లుగా విజే రెడ్డి దర్శకత్వంలో రఘునాథ రెడ్డి నిర్మించిన చిత్రం 'నెల్లూరి పెద్దారెడ్డి'. ప్రభాస్‌ శ్రీను, అంబటి శ్రీను, సమ్మెట గాంధీ తదితరులు నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. టైటిలే ఆసక్తిగా వున్న ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
గ్రామానికి సర్పంచ్‌ అయిన నెల్లూరి పెద్దారెడ్డి (సతీష్‌ రెడ్డి) గ్రామ ప్రజలకు దేవుడులాంటివాడు. కానీ భార్యను అస్సలు పట్టించుకోడు. దానికీ ఓ కారణం లేకపోలేదు. అలాంటి సమయంలో బతుకుతెరువు కోసం వచ్చిన మీనాక్షి (మౌర్యాని)తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిపోతుంది. విషయం తెలిసిన పెద్దారెడ్డి భార్య ముంతాజ్‌ కోపంతో రగిలి పోయి మీనాక్షిని చంపించడానికి ప్లాన్‌ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన సినిమా కథ.
 
విశ్లేషణ:
నెల్లూరి పెద్దారెడ్డి పాత్రలో సతీష్‌ రెడ్డి ఫర్వాలేదనిపించాడు. గ్రామ పెద్దగా, భార్యపై అసహనం వున్న వ్యక్తిగా నటించాడు. మౌర్యానీ, ముంతాజ్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రభాస్‌ శ్రీను, అంబటి శ్రీను గ్రామీణ ప్రాంతాల్లోని ఎంటర్‌టైన్‌మెంట్‌తో మెప్పించారు. సమ్మెట గాంధీ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
 
ముఖ్యంగా బాలసుబ్రమణి అందించిన ఛాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గ్రామీణ అందాలను తన కెమెరాలో బంధించి ఎంతో సుందరంగా కనిపించేలా చేశాడు. గురురాజ్‌ సంగీతం కూడా ఫరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు విజే రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో వుండే ముతక డైలాగ్‌లు సంభాషణలు నేటివిటీకి తగినట్లుగా చూపించాడు. అయితే తను రాసుకున్న కథను మరింత జాగ్రత్తగా స్క్రీన్‌ ప్లే పరంగా ఆకట్టుకునే విధంగా తీస్తే బాగుండేది. 

సంబంధిత వార్తలు

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!

తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments