Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న‌టి నుంచి గుళ్లూగోపురాలు చుట్టూ తిరుగుతున్న‌ వ‌ర్మ..‌. ఏమైంది..?

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (15:31 IST)
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్పుడూ ఏదో ర‌కంగా వార్త‌ల్లో ఉంటుంటారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. ఆ త‌ర్వాత ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అని టైటిల్ కూడా ఎనౌన్స్ చేసారు. తెలుగుదేశం నాయ‌కులు ఫైర్ అవ్వ‌డంతో వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ప‌క్క‌న పెట్టి నాగార్జున‌తో ఆఫీస‌ర్ సినిమా చేసాడు.
 
ఆ త‌ర్వాత ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడ‌క‌పోవ‌డంతో ఇక ఈ సినిమాని తీయ‌డం ఆపేసాడ‌నుకున్నారు. కానీ.. వ‌ర్మ ఎప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడో... ఏ సినిమా ఎనౌన్స్ చేస్తాడో ఊహించ‌డం క‌ష్టం. ఇంకా చెప్పాలంటే ఆయన చ‌ర్య‌లు ఊహాతీతం. నిన్నా, ఈ రోజు వ‌ర్మ చేసింది చూస్తే ఎవ‌రైనా ఇదే చెబుతారు. 
 
ఇంత‌కీ ఏం చేసాడంటే... దేవుడంటే న‌మ్మ‌కం లేద‌నే వ‌ర్మ నిన్న‌టి నుంచి గుళ్లూగోపురాలు చుట్టూ తిరుగుతున్నాడు. నాగార్జున‌తో గోవిందా గోవింద అనే సినిమా తీసిన‌ప్పుడు కూడా వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోని వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విష‌యంలో దేవుడిని ద‌ర్శించుకోవ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు ఇంకెన్ని సిత్రాలు చూపిస్తాడో..?

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments