Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీనటి వరలక్ష్మికి ఎన్.ఐ.ఏ సమన్లు

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (15:50 IST)
సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మికి జాతీయ దర్యాప్తు సంస్థ సమన్లు జారీచేసింది. గతంలో వరలక్ష్మి వద్ద పీఏగా పని చేసిన ఆదిలింగం అనే మాజీ సైనికోద్యోగిని డ్రగ్స్ కేసులో ఎన్.ఐ.ఏ అరెస్టు చేసింది. అతడి వివరాల సేకరణ కోసం వరలక్ష్మికి ఎన్.ఐ.ఏ సమన్లు జారీచేసింది. 
 
పాకిస్థాన్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న 300 కేజీల హెరాయిన్, ఏకే 47 తుపాకీ, 1000 తుపాకీ తూటాల కేసులో ఆమె వ్యక్తిగత సహాయకుడు, మాజీ సైనికోద్యోగి ఆదిలింగం‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని కోరుతూ సమన్లు జారీచేసింది. 
 
కాగా, వరలక్ష్మికి తమిళ చిత్రపరిశ్రమలో కంటే తెలుగు చిత్రపరిశ్రమలోనే అత్యధికంగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అందుకే ఆమె తన మకాంను కూడా చెన్నై నుంచి హైదరాబాద్ నగరానికి మార్చారు. కోలీవుడ్ కంటే టాలీవుడ్ తనలోని ప్రతిభను గుర్తించి, అవకాశాలు ఇస్తుందంటూ వరలక్ష్మి పలుమార్లు మీడియా సమావేశాల్లో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెరుపు వేగంతో రోడ్డుపై యువకుడిని ఢీకొట్టిన బైక్, నడిపే వ్యక్తి మృతి (Video)

సకల వర్గాల ప్రజల మేలు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యారాధన

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments