Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (09:14 IST)
టాలీవుడ్ సినీ నిర్మాత వేదరాజు టింబర్ ఇకలేరు. ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు వయసు 54 సంవత్సరాలు. హీరో అల్లరి నరేష్‌‍తో ‘మడత కాజా‘, ‘సంఘర్షణ‘ వంటి  చిత్రాలను నిర్మించారు. సినిమాలపై ఇష్టంతో ఓ వైపు నిర్మాణ రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్. త్వరలో మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే ఈ విషాదకర సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 
 
గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో హైదరాబాద్ నగరంలోని ఏఐజీ హాస్పిటల్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే కోలుకుని వస్తారు అని సన్నిహితులు, కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో ఇలా జరగటం వారందరిలో విషాదాన్ని నింపింది. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అంత్య క్రియలు శుక్రవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments