Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

సెల్వి
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (10:55 IST)
Nikhil
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థి తన మామకు మద్దతుగా టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ గురువారం రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి, తన మామ ఎం.ఎం.కొండయ్య నామినేషన్ ర్యాలీలో నిఖిల్ సిద్ధార్థ్ పాల్గొన్నారు. 
 
తన కారులో నిలబడి అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ కొందరితో కరచాలనం చేశాడు. అభిమానుల హర్షధ్వానాల మధ్య వారితో సెల్ఫీలు కూడా దిగాడు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
 
కొండయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని చీరాల ప్రజలకు నిఖిల్ విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యమని నిఖల్ అన్నారు. 
 
నిఖిల్ గత నెలలో టీడీపీ జనరల్ సెక్రటరీ లోకేష్ నాయుడుని కలిశారు. దీంతో ఆయన టీడీపీలో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే దీనిని ఖండించిన ఆయన.. తన మామకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపేందుకే లోకేష్‌ను కలిశానని స్పష్టం చేశారు.
 
నిఖిల్ చివరిసారిగా గత ఏడాది జూన్‌లో విడుదలైన "గూఢచారి" చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. గత నెలలో అతను బాక్సాఫీస్ వద్ద షేక్ చేసిన "కార్తికేయ 2" (2022)కి సీక్వెల్ గా "కార్తికేయ 3"ని ప్రకటించాడు. ప్రస్తుతం "స్వయంభు", "ది ఇండియా హౌస్" చిత్రాల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments