Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీవీప్యాట్‌లతో వంద శాతం ఓట్ల ధృవీకరణ కేసు : నేడు సుప్రీం తీర్పు

Advertiesment
vvpat

వరుణ్

, శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (10:22 IST)
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదయ్యే ఓట్ల సంఖ్యను వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుతో 100 శాతం సరిపోల్చాలంటూ దాఖలైన కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించనుంది. ఈసీ ప్రతివాదిగా ఉన్న ఈ కేసును అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సహా పలువురు దాఖలు చేశారు. 
 
బుధవారం సుప్రీంలో కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌లకు సంబంధించి న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు ఎన్నికల సంఘానికి చెందిన నిపుణులు స్వయంగా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించడం తమ పనికాదని స్పష్టం చేసింది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌కు తాము మార్గదర్శకాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. దీంతో సుప్రీం వెలువరించే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాళ్ళ టైమ్ బాగోలేక నేను హోం మంత్రిని అయితే కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకే : రాజగోపాల్ రెడ్డి