Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహ భర్తకు షాకిచ్చిన విద్యుత్ బోర్డు.. ఎలాగంటే?

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (11:03 IST)
తమిళనాడు విద్యుత్ బోర్డు తమిళనటుడు ప్రసన్నకు షాకిచ్చింది. ప్రముఖ సినీ నటి స్నేహ భర్త అయిన ప్రసన్నకు ఒక నెలకు ఏకంగా రూ.70 వేల బిల్లు పంపి విస్తుపోయేలా చేసింది. ప్రసన్న, ఆయన తండ్రి, మామగారి ఇళ్లకు మొత్తంగా రూ. 70 వేల బిల్లు పంపిన బోర్డు.. వెంటనే చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. బిల్లు చూసి షాకైన ప్రసన్న విద్యుత్ బోర్డుపై మండిపడ్డారు. 
 
తానైతే రూ. 70 వేలు చెల్లించగలనని, కానీ ఇదే బిల్లు పేదల ఇంటికి వస్తే పరిస్థితి ఏమిటని ప్రసన్న ప్రశ్నించారు. నిజానికి తమకు రెండు నెలలకు కూడా ఇంత బిల్లు రాదని, సాధారణంగా వచ్చే బిల్లుకు ఎన్నో రెట్లు ఎక్కువగా బిల్లు పంపారని ఫైర్ అయ్యారు. 
 
రెండు నెలలకు పైగా రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మీటరు రీడింగులో తప్పులు దొర్లాయని విద్యుత్ శాఖాధికారి తెలిపారు. ప్రసన్న ఇంటికి పంపిన బిల్లును సరిచేసి మళ్లీ పంపిస్తామని విద్యుత్ బోర్డు అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments