Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహా కోసం రంగంలోకి దిగిన స్టార్ డైరెక్టర్స్

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (21:52 IST)
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహాతో ఓహో అనిపించుకోవాలని.. బిగ్ సక్సస్ సాధించాలని డిజిటల్ ఫ్లాట్ఫామ్‌లో దిగిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్ స్టార్ డైరెక్టర్స్‌ని రంగంలోకి దింపారని తెలిసింది. ఇంతకీ.. ఆహా కోసం వర్క్ చేస్తున్న స్టార్ డైరెక్టర్స్ ఎవరంటారా..? ముందుగా చెప్పుకోవాల్సింది. వంశీ పైడిపల్లి. సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో మహర్షి సినిమాని తెరకెక్కించిన వంశీ పైడిపల్లి.
 
ఆ తర్వాత మహేష్‌ బాబుతో మరో సినిమా చేయాలనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు ఆహా కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇక బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ చేయాల్సివుంది కానీ.. కరోనా కారణంగా ఆగింది. ఇదిలా ఉంటే.. కొరటాల పర్యవేక్షణలో ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ రెడీ అవుతుందట. దీనికి కథను కొరటాల అందించగా దర్శకత్వం మాత్రం కొరటాల శిష్యుడు అందిస్తున్నాడని సమాచారం.
 
అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఓ వెబ్ సిరీస్ కోసం స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారు. వీరితో పాటు రానా - సాయిపల్లవి జంటగా విరాటపర్వం సినిమా చేస్తున్న వేణు కూడా ఆహా కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. మరి... ఈ స్టార్ డైరెక్టర్స్ చేస్తున్న వెబ్ సిరీస్‌తో అయినా ఆహా ఓహో అనిపించుకుంటుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments