పట్టాలెక్కనున్న రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు : పది భాగాలుగా 'మహాభారతం'

Webdunia
బుధవారం, 10 మే 2023 (10:31 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన కలల ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. మహాభారతాన్ని ఆయన పది భాగాలుగా నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నారు. తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు, 'మహాభారతం' తాను తీస్తే బహుశా పది భాగాలు ఉంటుందేమోనని అభిప్రాయపడ్డారు.
 
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళిని ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ 'తంలో మీరు 'మహాభారతం' తీస్తానని అన్నారు. అద్భుతమైన ఆ దృశ్య కావ్యం టెలివిజన్లో 266 ఎపిసోడ్స్ ప్రసారమైంది. మీరు తీయాలనుకుంటే ఎన్ని భాగాలుగా తీస్తారు' అని ప్రశ్నించారు. ఇందుకు రాజమౌళి సమాధానం ఇస్తూ 'నాకు కూడా తెలియదండీ. ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఒకవేళ 'మహాభారతం' తీయాలంటే భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని వెర్షన్స్ చదవాలంటేనే ఏడాదిపైనే సమయం పట్టవచ్చు. అప్పటికి ఒక్క అక్షరం కూడా పేపరుపై పెట్టలేకపోవచ్చు. చాలా పెద్ద ప్రాజెక్టు. 'మహాభారతం' తీస్తే పది భాగాలు తీయాల్సి వస్తుందేమోనని నేను ఊహిస్తున్నా. అయితే, ఎన్ని భాగాలు అవుతుందో కచ్చితంగా చెప్పలేను' అని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments