Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణి ఆత్మహత్య కేసు : ఆచూకీ లేని 'ఆర్ఎక్స్ 100' నిర్మాత

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (08:12 IST)
బుల్లితెర సీరియల్ నటి శ్రావణి కొండపల్లి ఆత్మహత్య కేసులో మూడో నిందితుడుగా ఉన్న 'ఆర్ఎక్స్100' మూవీ నిర్మాత అశోక రెడ్డి అచూకీ ఇంకా లభ్యంకాలేదు. ఈ కేసులో ఆయన పేరును పోలీసులు ఏ3గా నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన అదృశ్యమైపోయాడు. దీంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
కాగా, ఇదే కేసులో ఏ1గా ఉన్న సాయికృష్ణారెడ్డి, ఏ3గా ఉన్న దేవరాజ్ రెడ్డిలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే, ఏ2 నిందితుడిగా ఉన్న అశోక్ రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఎస్సార్ నగర్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం విచారణకు హాజరుకానున్నట్టు చెప్పినప్పటికీ, సెల్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆయన సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా అతడెక్కడున్నదీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
 
మరోవైపు, సినిమా రంగంలో అవకాశాల పేరుతో శ్రావణితో అశోక్‌రెడ్డి దగ్గరయినట్టు పోలీసులు గుర్తించారు. శ్రావణికి దేవరాజ్ దగ్గర కావడంతో జీర్ణించుకోలేకపోయిన అశోక్‌ రెడ్డి... సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి వారు విడిపోయేలా చేశాడు. 
 
ఈ నెల 7వ తేదీన అమీర్‌పేటలో ఓ హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అశోక్‌ రెడ్డితో కలిసి శ్రావణిపై సాయి దాడిచేశారు. ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌ రెడ్డి కీలకపాత్ర పోషించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments