ప్రభాస్‌కి షాక్ ఇచ్చిన అఖిల్

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (23:04 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాథాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో రెబల్‌స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సంవత్సరంలోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ... కరోనా కారణంగా కుదరలేదు.
 
ప్రభాస్ - పూజాహేగ్డే జంటగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. హైదరాబద్‌లోనే భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఇప్పుడు ప్రభాస్‌కి అఖిల్ షాక్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే... అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.
 
ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అఖిల్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కావాల్సి వుంది కానీ కుదరలేదు. ప్రభాస్ రాథేశ్యామ్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ పూజా హేగ్డే.
 
అయితే ముందుగా ప్రభాస్ రాథేశ్యామ్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతుంది అనుకున్నారు కానీ... అఖిల్ తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి షాక్ ఇచ్చాడు. అఖిల్, పూజాపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ రాథేశ్యామ్ వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments