Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుస్తకం చదవలేక పోవచ్చు.. అంటే ఆ పుస్తకం బాగోలేదని కాదు... శ్వేతాబసు విడాకులు (video)

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (13:22 IST)
టాలీవుడ్‌తో పాటు హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ భాషల్లో నటించిన నటి శ్వేతాబసు. తెలుగులో కొత్త బంగారులోకం చిత్రంతో మంచి పేరుదక్కించుకుంది. ఈమె వ్యభిచారం కేసులో చిక్కుకుని టాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఈ కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత ఆమెకు ఒకటి, అర సినీ అవకాశాలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత సినిమాల్లో నిలదొక్కుకోలేక పోయింది. 
 
ఈ క్రమంలోనే సినీ రంగానికి చెందిన రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం కూడా ఒక యేడాది క్రితం జరిగింది. అయితే, వీరిద్దరి పెళ్లి సంవత్సరం తిరగకుండానే పెళ్లి పెటాకులు కానుంది. 
 
ఇదే అంశంపై శ్వేతా బసు స్పందిస్తూ, తమ వివాహబంధానికి ముగింపు పలకాలని తాను, రోహిత్ పరస్పరం అంగీకారానికి వచ్చామని తెలిపింది. లోతుగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఇరువురి భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయానికి వచ్చామని పేర్కొంది. 
 
ముఖ్యంగా, ప్రతి పుస్తకాన్ని మనం పూర్తిగా చదవలేక పోవచ్చని... దీని అర్థం ఆ పుస్తకం బాగోలేదని కాదని చెప్పింది. తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించినందుకు, తనకు స్ఫూర్తిగా నిలిచినందుకు రోహిత్‌కు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపింది. రోహిత్ భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలని ఆకాంక్షించింది. 
 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments