Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో ముగిసిన కార్మికుల సమ్మె - రేపటి నుంచి షూటింగులు

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (19:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. వేతనాలను పెంచాలని కోరుతూ సినీ నిర్మాణ కార్మికులు చేపట్టిన సమ్మెను గురువారం విరమించుకున్నారు. దీంతో శుక్రవారం నుంచి వారు తిరిగి షూటింగుల్లో పాల్గొననున్నారు. 
 
వేతనాల పెంపుపై నిర్మాతల మండలి వైపు నుంచి స్పష్టమైన హామీ రావంతో సమ్మెను విరమిస్తున్టన్టు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో నిర్మాతల మండలితో కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఇందులో సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై సుమారు 2 గంటల పాటు వీరు చర్చించారు. 
 
ఈ చర్చలు సానుకూలంగా ముగిశాయి. పైగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మాతల మంలి ప్రకటించింది. ఈ కమిటీ కూడా శుక్రవారం సమావేశమై కమిటీతో చర్చించి, వేతనాల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటుందని, అందువల్ల కార్మికులంతా యథావిధిగా షూటింగులకు హాజరుకావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. దీంతో సినీ కార్మికులు తలపెట్టిన సమ్మె 48 గంటలు కూడా పూర్తికాకముందే ముగిసిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments