Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయనీగాయకులకు కూడా రాయల్టీ

ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్- ఇస్రా బుధవారం నాడు హైదరాబాద్‌లో సమావేశాన్ని నిర్వహించింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు పలువురు గాయకులు, ఇస్రా సీఈవో సంజయ్ టాండన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ 2012లో కేంద్రం అమల్

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (18:22 IST)
ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్- ఇస్రా బుధవారం నాడు హైదరాబాద్‌లో సమావేశాన్ని నిర్వహించింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు పలువురు గాయకులు, ఇస్రా సీఈవో సంజయ్ టాండన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ 2012లో కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన రాయల్టీ చట్ట ప్రకారం పాటలపై వచ్చే ఆదాయంలో గాయనీ గాయకులకు కూడా వాటా ఉంటుందని పేర్కొన్నారు.
 
ఐపీఎల్ వంటి ఈవెంట్‌లలో పాడే పాటలకు సంగీత దర్శకుడు, గేయ రచయిత, నిర్మాత, ఆడియో హక్కులను కలిగిన కంపెనీలతో పాటు గాయనీ గాయకులకు రాయల్టీ చెల్లించాలని చట్టంలో పొందుపరిచినట్లు తెలిపారు. ఇస్రా ద్వారా వారికి 50 ఏళ్ల పాటు రాయల్టీ చెల్లించే విధంగా నిబంధనలను రూపొందించారని తెలిపారు. ఈ చట్టం అమల్లోకి రావడం పట్ల పలువురు గాయకులు హర్షం వ్యక్తం చేసారు. గాయనీ గాయకుల్లో ఎవరైనా అనారోగ్యంతో మరణిస్తే, వారి కుటుంబసభ్యులకు ఆ రాయల్టీ మొత్తాన్ని ఇస్రా సంస్థ చెల్లిస్తుందని చెప్పారు. దీని ద్వారా గాయనీ గాయకులకు చక్కని భవిష్యత్తు ఉంటుందని, అలాగే వారు పాటపై పూర్తిగా హక్కును కలిగి ఉంటారని బాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments