Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అడ్డుపడిన మాంసపు ముక్క... గాల్లో కలిసిన ప్రాణాలు...

కొన్ని మరణాలు వినేందుకు ఒకింత ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి మరణం ఒకటి అనంతపురం జిల్లాలో సంభవించింది. మాంసపు ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం రూ

అడ్డుపడిన మాంసపు ముక్క... గాల్లో కలిసిన ప్రాణాలు...
, గురువారం, 9 ఆగస్టు 2018 (15:06 IST)
కొన్ని మరణాలు వినేందుకు ఒకింత ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి మరణం ఒకటి అనంతపురం జిల్లాలో సంభవించింది. మాంసపు ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం రూరల్ మండలంలో ఈ ఘటన జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని ఆవులదట్ల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా రామాంజనేయులు (35) అనే వ్యక్తి పని చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కూలీలంతా భోజనానికి వచ్చారు. వారితో పాటు ఈయన కూడా ఇంటికి వచ్చి భోజనం చేయసాగాడు. 
 
అపుడు ఓ మాంసం ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన విలవిల్లాడి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆవులదట్ల ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. 
 
విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏ పీవో అప్పస్వామినాయుడు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సకాలంలో వైద్యం అంది ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కుటుంబ సభ్యులు వాపోయారు. మృతుడు రా మాంజినేయులుకు భార్య లక్ష్మీదేవితో పాటు ఇద్దరు సంతానం ఉన్నట్లు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా కోసం మృగంగా మారిన మలయాళ సూపర్‌స్టార్