Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం... సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ మృతి

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (08:50 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం సంభవించింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 2017లో వచ్చిన 'దర్శకుడు' చిత్రానికి ప్రవీణ్ అనుమోలు తొలిసారి కెమెరామెన్‌గా పని చేశారు. 
 
ఆ తర్వాత 'బాజీరావు మస్తానీ', 'ధూమ్ 3', 'బేబీ', 'పంజా', 'యమదొంగ' వంటి చిత్రాలకు ఆయన ఛాయాగ్రహణం సమకూర్చారు. దర్శకుడు కె.విశ్వనాథ్, హీరో తారకరత్న మృతి నుంచి చిత్రపరిశ్రమ ఇంకా కోలుకోలేదు. ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకోవడాన్ని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
సుకుమార్ వంటి దర్శకుల చిత్రాల్లో అసిస్టెంట్ కెమెరామెన్‌గా పని చేసిన ప్రవీణ్ అనుమోలు.. ఆ తర్వాత జక్కా హరి ప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. ఇందులో అశోక్ భానురెడ్డి, ఈషా రెబ్బాలు హీరోహీరోయిన్లుగా నటించారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments