Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మికపై మనసుపడిన మాటల మాంత్రికుడు?

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (15:12 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నారు. "సన్నాఫ్ సత్యమూర్తి" తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న చిత్రం ఇదే. ఈ చిత్రానికంటే ముందు 'జులాయ్' వచ్చింది. ఈ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఇపుడు ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. 
 
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఈసారి పూర్తి మార్పుకోరుకుంటున్నారట. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలకు దేవిశ్రీ సంగీతం అందించారు. ఈసారి దేవిశ్రీ స్థానంలో ఎస్.ఎస్. థమన్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. దీనికి ఫిదా అయిన త్రివిక్రమ్.. ఈ దఫా థమన్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట.
 
అలాగే, హీరోయిన్ల విషయంలోనూ త్రివిక్రమ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేరును పరిశీలించిన ఆయన... చివరగా కియారా అద్వానీ, రష్మిక మందన్నాలపై దృష్టిసారించి.. చివరకు 'గీత గోవిందం' హీరోయిన్‌పై మనసుపడినట్టు సమాచారం. అయితే, హీరో, త్రివిక్రమ్ కలిసి ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు వేస్తారో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments